న్యూఢిల్లీ : వేతన జీవులకు మోదీ సర్కారు భారీ ఊరట కల్పించింది. వార్షిక ఆదాయం
రూ.7లక్షల వరకు ఉన్నవారు పన్ను చెల్లించే అవసరం లేదని స్పష్టం చేసింది. కేంద్ర
బడ్జెట్లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఉరట. లక్షలాది మందికి ప్రయోజనం కలిగేలా
వ్యక్తిగత పన్ను రిబేట్ పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర విత్త
మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈమేరకు ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త
విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు
మినహాయింపులు ఉపయోగించుకొని పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో, శ్లాబుల సంఖ్యను 5కు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యక్ష,
పరోక్ష పన్నుల్లో మినహాయింపుల కారణంగా ఏటా ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల
ఆదాయం తగ్గనుందని నిర్మల వెల్లడించారు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్గా
అమలుకానుందని, అయితే ఈ విధానాన్ని ఎంచుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకే
వదిలేస్తున్నామని స్పష్టం చేశారు.